Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలి తీవ్రత: కాన్పూర్‌లో ఒక్కరోజే 25మంది మృతి

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (11:00 IST)
ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత కారణంగా ఒక్క కాన్పూర్ ప్రాంతంలోనే ఒక్కరోజే 25 మంది చనిపోయారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా మంచు కురుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన చలి కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 
 
ఈ పరిస్థితిలో రోడ్డుపక్కన నివాసముంటున్న నిరాశ్రయులకు శాశ్వత నివాసం, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, చాలా ప్రాంతాల్లో ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. 
 
నోయిడా, ఘజియాబాద్, అయోధ్య, కాన్పూర్, లక్నో, బరేలీ, మొరాదాబాద్‌లలో పగటిపూట కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, తూర్పు ప్రాంతంలో కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
 
ఉత్తరప్రదేశ్‌లో చలి రోజురోజుకు పెరుగుతుండటంతో కాన్పూర్‌లో గురువారం (5వ తేదీ) గుండెపోటు, పక్షవాతం కారణంగా 25 మంది మరణించారు. వీరిలో 17 మంది వైద్యం అందక ముందే మృతి చెందినట్లు సమాచారం. విపరీతమైన చలి వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటుతో చనిపోతారని, రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments