Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి భక్తులకు పెద్ద షాక్... గదుల అద్దె ధరలు పెంపు

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (09:33 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు పెద్ద షాక్. తిరుమలలో గదుల అద్దెల ధరలు పెంచి సామాన్యులకు షాకిచ్చింది టీటీడీ. నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత ధరలను రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచినట్లు సమాచారం. 
 
నారాయణగిరి రెస్ట్‌హౌస్‌లోని 1,2,3 గదుల ధరలను కూడా అధికారులు రూ.150 నుంచి రూ.1700కు పెంచారు. 
 
రెస్ట్ హౌస్ అద్దె ధరలు రూ.750 నుంచి రూ.1700కి పెరిగాయి. జీఎస్టీతో కలిపి కార్నర్ సూట్ ధర రూ.2200కి పెరిగింది. ప్రత్యేక కాటేజీల గది అద్దెలు రూ.750 నుంచి రూ.2800కి పెరిగాయి.  
 
అంతేగాకుండా గది అద్దెతో పాటు నగదు కూడా డిపాజిట్ చెల్లించాల్సి వుంటుందని టీటీడీ ప్రతిపాదించింది. ఉదాహరణకు రూ. 1700ల గది అద్దెకు కావాలనుకున్నప్పుడు కలిపి రూ.3400చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 
 
స్వామి భక్తులను నిలువు దోపిడీ చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని అంటున్నారు. జనవరి 1వ తేది నుంచి పెంచిన ధరలు వసూలు చేస్తోంది టీటీడీ. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments