Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వల్ప అస్వస్థతకుగురైన తమిళనాడు సీఎం స్టాలిన్

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (14:50 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను మూడు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులకు సూచించడంతో ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. 
 
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రజలతో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అదేసమయంలో జిల్లాల్లో పర్యటిస్తూ, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును ఆకస్మిక తనిఖీల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి ఆయన జ్వరతో బాధపడుతున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. రెండురోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు. 
 
కాగా, అనారోగ్యం నేపథ్యంలో సోమవారం నుంచి మూడు జిల్లాల్లో సాగాల్సిన ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలు రద్దు అయ్యాయి. ఆయన వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో పర్యటించి, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుంది. 
 
పైగా, ఆయన పర్యటనకు డీఎంకే శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఆయన అస్వస్థత కారణంగా తన ఇంటికే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments