Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ... లాలూతో భేటీ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (20:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు బిహార్‌లో పర్యటించిన సందర్భంగా బుధవారం ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ పాట్నా చేరుకున్నారు. 
 
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో ఆయన సమావేశమయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను కూడా ఆయన అందజేశారు. అనంతరం నితీష్, తేజస్విలతో జాతీయ రాజకీయాలపై చర్చించారు. 
 
ఈ భేటీ అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్నేళ్లుగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే కోర్టు బెయిల్‌పై విడుదలైవున్నారు. 
 
ఆ తర్వాతు లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాలూ ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని, తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments