Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామకృష్ణ ఆశ్రమంలో అమానుష చర్య : పెన్ను దొంగిలించాడని థర్డ్ క్లాస్ బాలుడిని చితకబాదారు...

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (10:45 IST)
కర్నాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌లో ఉన్న రామకృష్ణ ఆశ్రయంలో అమానుష చర్య జరిగింది. పెన్ను దొంగిలించాడన్న అనుమానంతో మూడో తరగతి చదువుతున్న బాలుడుని చితకబాదారు. ఆశ్రమ మేనేజర్, ఆయన ఇద్దరు సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
మూడేళ్ల బాధిత బాలుడి పేరు తరుణ్ కుమార్. రాయచూర్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్, ఆయన సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 'ఇద్దరు అబ్బాయిలు, టీచర్ కొట్టారు. కర్రతో కొట్టినప్పుడు అది విరిగిపోయింది. అప్పుడు బ్యాట్‌తో కొట్టారు. శరీరంపై గాయాలు కూడా చేశారు. ఆ తర్వాత యాద్గిర్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వద్ద అడుక్కోమన్నారు. కానీ, ఎవరూ డబ్బులు ఇవ్వలేదు' అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పెన్ను కోసమే తనను కొట్టారని పేర్కొన్నాడు.
 
దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లు పూర్తిగా ఉబ్బిపోయాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బాలుడిని అతడి తల్లిదండ్రులు ఆశ్రమంలో వేశారు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఓ పెన్నును దొంగిలించాడు. ఈ విషయాన్ని వారు ఆశ్రమ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోపంతో ఊగిపోయిన వేణుగోపాల్, మరో ఇద్దరు కలిసి తరుణ్ పై దారుణంగా దాడిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments