Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా శరద్ అర్వింద్ బాబ్డే.. సిఫార్సు చేసిన సీజేఐ

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (11:49 IST)
భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే నియమితులుకానున్నారు. ఆయన పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ జస్టీస్‌లలో బాబ్డే మొదటిగా ఉన్నారు. దీంతో ఆయన పేరును సీజేఐ సిఫార్సు చేశారు. 
 
సుప్రీంకోర్టు సాంప్రదాయం ప్రకారం తన తదుపరి వారసుడిని ప్రస్తుత సీజేఐ ప్రతిపాదించాలి. దీంతో ఎస్‌ఏ బాబ్డేను సీజేఐగా నియమించే చర్యలను ప్రారంభించాల్సిందిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రంజన్‌ గగోయ్‌ కోరారు. గగోయ్ నవంబరు 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. 
 
బాబ్డే 24 ఏప్రిల్‌, 1956న నాగ్‌పూర్‌లో జన్మించారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments