Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా శరద్ అర్వింద్ బాబ్డే.. సిఫార్సు చేసిన సీజేఐ

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (11:49 IST)
భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే నియమితులుకానున్నారు. ఆయన పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ జస్టీస్‌లలో బాబ్డే మొదటిగా ఉన్నారు. దీంతో ఆయన పేరును సీజేఐ సిఫార్సు చేశారు. 
 
సుప్రీంకోర్టు సాంప్రదాయం ప్రకారం తన తదుపరి వారసుడిని ప్రస్తుత సీజేఐ ప్రతిపాదించాలి. దీంతో ఎస్‌ఏ బాబ్డేను సీజేఐగా నియమించే చర్యలను ప్రారంభించాల్సిందిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రంజన్‌ గగోయ్‌ కోరారు. గగోయ్ నవంబరు 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. 
 
బాబ్డే 24 ఏప్రిల్‌, 1956న నాగ్‌పూర్‌లో జన్మించారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments