Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. జస్టిస్ ఎన్వీ రమణ

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (18:41 IST)
ఈ దేశంలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, దర్యాప్తు సంస్థలు మాత్రం శాశ్వతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ రావాలన్నారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి యేటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలని ఆయన  వివరిచారు. 
 
విశ్వసనీయతలో జాతీయ సంస్థ కంటే రాష్ట్రాల పోలీసులు బాగా వెనుకబడుతున్నారని చెప్పారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. అదేసమయంలో ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ముఖ్యంగా, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం అని అన్నారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని ఆయన ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments