ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

ఠాగూర్
శనివారం, 15 నవంబరు 2025 (11:16 IST)
ఇటీవలి కాలంలో భారత ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల కారణంగా ఆ సంఘం ప్రతిష్ట దిగజారిపోతోందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అద్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. పైగా, తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఓ పాఠంలాంటివన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ ఫలితాలపై ఇండియా కూటమి నేతలు ఎంతో నేర్చుకోవాలన్నారు. 
 
బీహార్‌ ఎన్నికల ఫలితాలు అందరికీ పాఠమన్నారు. నిర్ణయాత్మక విజయం సాధించిన సీఎం నీతీశ్‌కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త రాజకీయ సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరన్నారు.
 
అలాగే, ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ ఫలితంలో ఈసీపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. ఈసీ ప్రతిష్ట దిగజారిపోయిందని గుర్తుచేశారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా విశ్వాసాన్ని ప్రేరేపించేలా ఎన్నికల సంఘం ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments