Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ శశికళకు షాక్, రూ.2 వేల కోట్లను అటాచ్ చేసిన ఐటీ శాఖ

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:44 IST)
తమిళనాడులో జయలలిత హయాంలో చిన్నమ్మ పేరిట తెర వెనుక శక్తిగా పెరిగిన శశికళ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో పడింది. తాజాగా శశికళకు ఐటీ శాఖ భారీ షాకిచ్చింది. మరికొన్నాళ్లలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ మళ్లీ రాజకీయంలో తనదైన రీతిలో హవా సాగించాలని భావించారు.
 
అయితే ఆమెకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేయడం ద్వారా ఐటీ శాఖ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. శశికళకు చెందిన ఈ ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఐటీ అధికారులు స్తంభింపజేశారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్న శశికళకు ఈ మేరకు నోటీసులు పంపారు.
 
కాగా అటాచ్ చేసిన ఆస్తులలో కొడనాడు సిరతాపూర్ ప్రాంతాలలో ఆమెకు రెండు ఆస్తులు ఉండగా అవి రెండూ శశికళ పేరిటే ఉన్నాయి. ఇవే కాకుండా అనేక ఆస్తులను గతంలోనే గుర్తించిన ఐటీ శాఖ తన దర్యాప్తులో వాటిని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే అటాచ్ చేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments