Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (18:24 IST)
కొందరు విద్యార్థులు కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం వారంతా కలిసి పక్కా ప్రణాళికను రచించారు. సోడియం అనే రసాయన పదార్థం నీటితో కలిసినపుడు పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వారు తెలుసుకున్నారు. ఈ కుట్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
హోం వర్క్ సరిగా చేయకపోవడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ మహిళా టీచర్‌పై వారు కోపం పెంచుకున్నారు. ఆమె మరుగుదొడ్డికి వచ్చే సమయంలో సిస్టర్న్ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో అది పేలిపోయింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన ఈ నెల 21వ తేదీన చోటుచేసుకుంది. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని జువైనల్ హోంకు తరలించారు. అరెస్టు చేసిన వారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

స్కూటర్‌ కమ్‌ ఆటో వెహికల్ ప్రేమలో పడిన టీనేజర్స్ కథతో టుక్‌ టుక్‌

ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్ నుంచి త‌నికెళ్ల శంక‌ర్ రాసిన శివ త‌త్వాన్ని ఆవిష్క‌రించిన తనికెళ్ల భరణి

నారి సినిమా నుంచి రమణ గోగుల పాడిన గుండెలోన.. సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments