Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (18:24 IST)
కొందరు విద్యార్థులు కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం వారంతా కలిసి పక్కా ప్రణాళికను రచించారు. సోడియం అనే రసాయన పదార్థం నీటితో కలిసినపుడు పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వారు తెలుసుకున్నారు. ఈ కుట్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
హోం వర్క్ సరిగా చేయకపోవడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ మహిళా టీచర్‌పై వారు కోపం పెంచుకున్నారు. ఆమె మరుగుదొడ్డికి వచ్చే సమయంలో సిస్టర్న్ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో అది పేలిపోయింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన ఈ నెల 21వ తేదీన చోటుచేసుకుంది. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని జువైనల్ హోంకు తరలించారు. అరెస్టు చేసిన వారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments