Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

Advertiesment
encounter

ఠాగూర్

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (16:16 IST)
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో మోగిపోయింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. 
 
గంగలూరు అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త ఆదాయపన్ను శ్లాబుల మార్పుల వల్ల ఎవరికెంత లాభం?