Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి కాదు.. మృగాడు... లేగదూడపై కారు ఎక్కించి చంపేశాడు... (Video)

వరుణ్
గురువారం, 27 జూన్ 2024 (14:53 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అతికిరాతక చర్యకు పాల్పడ్డాడు. రోడ్డుపై పడుకునివున్న లేగదూడపై కారు ఎక్కించి చంపేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రోడ్డుపై పడుకునివున్న ఓ లేగదూడపైకి ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా తన హ్యూందాయ్ కారును ఎక్కించాడు. అంతేకాకుండా, మళ్ళీ వెనక్కి వచ్చి మరోమారు దానిపైకి కారును ఎక్కించాడు. దీంతో ఆ లేగ దూడ చనిపోయింది. అయితే, తన బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి ఆవు తల్లడిల్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 
 
అలాగే, అక్కడ ఉన్న 7 నుంచి 8 ఆవులు మార్గమధ్యంలో చనిపోయి పడివున్న దూడ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నంబరును తెలుసుకుని, ఆ వివరాల ఆధారంగా కారు యజమాని షేక్ షాహిద్‌గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments