Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచింది కొండంత.. తగ్గించింది గోరంత : ఛత్తీస్‌గఢ్ సీఎం బాఘెల్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (08:37 IST)
దీపావళి పండుగకు ముందు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.5, రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ స్పందించారు. ఈ తగ్గింపు సరిపోదని, యూపీఏ-2 హయాంలో ఉన్న స్థాయికి పెట్రో ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు దిగివచ్చి ఎక్సైజ్‌ డ్యూటీని కాస్తంత తగ్గించిందని ఎద్దేవా చేశారు. 'ముందేమో పెట్రోలు ధరలను రూ.30 దాకా ధర పెంచారు. ఇప్పుడు కేవలం రూ.5 తగ్గించి.. అందరి ప్రశంసలనూ కోరుకుంటున్నారు' అంటూ మండిపడ్డారు. 
 
ఎక్సైజ్‌ డ్యూటీ యూపీఏ హయాంలో రూ.9.27 ఉండేదని.. దాన్ని రూ.30కి పెంచేశారని.. అప్పటిలాగా ఇప్పుడు ఎక్సైజ్‌ డ్యూటీని రూ.9కి తగ్గించాలని, అప్పుడు ప్రజలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఆయన సూచించారు. అదేసమయంలో తాము రాష్ట్రపరిధిలో ఉన్న పన్నులను తగ్గించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments