Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెడ్ కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (18:54 IST)
బందోబస్తు విషయంపై తలెత్తిన చిన్నపాటి గొడవ ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసింది. ఓ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకర్ జిల్లాలో జరిగింది. 
 
కాంకర్‌లోని ప్రభుత్వ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి అక్క ఈవీఎంలను భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్  ఫోర్స్ (సీఏఎఫ్) 11వ బెటాలియన్ గార్డును భద్రత కోసం నియమించారు. అయితే, ఈ విధుల్లో నిమగ్నమైన కానిస్టేబుల్ పురుషోత్తమ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర భగత్‌ మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్ పురుషోత్తమ్.. తన వద్ద ఉన్న ఇన్సాస్ రైఫిల్‌తో హెడ్ కానిస్టేబుల్‌ తలపై కాల్చాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
ఆ తర్వాత కానిస్టేబుల్ గదిలోకి వెళ్లి బంధించుకున్నాడు. విషయం తెలిసిన సీనియర్ అధికారులు అతడిని ఒప్పించి బయటకు రప్పించి, అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ నెల 5వ తేదీన భానుప్రతాప్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగగా, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టారు. అనంతరం ఈవీఎంలను మరో 45 రోజుల పాటు భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. అక్కడ సెక్యూరిటీగా ఉండే విషయంపై వారి మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవ జరిగినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments