Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ముఖ్యమంత్రి ఈపీఎస్‌కు ఎమ్మెల్యే రోజా పరామర్శ

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (10:25 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి ఇటీవలే మాతృవియోగం జరిగింది. ఆయన తల్లి తవసాయమ్మ ఇటీవల కన్నుమూశారు. అయితే, ఏపీలోని నగరి ఎమ్మెల్యే, సినీ నటితి, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే.రోజా చెన్నైకు చేరుకుని సీఎం ఎడప్పాడి తల్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎడప్పాడిని పరామర్శించారు. 
 
అలాగే, సీఎంను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా నేతలు గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు. 
 
బుధవారం ఆర్కే రోజా తన భర్త ఆర్కే సెల్వమణితో కలసి సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొంతసేపు పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతి తెలియజేశారు.  
 
ఇదిలావుంటే, పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరులకు వందనం సమర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని ఇప్పటివరకు విధుల్లో అమరులైన పోలీసుల పేర్లు, వివరాలను పొందు పరుస్తూ డీజీపీ కార్యాలయం ఆవరణలో శిలాఫలకాన్ని రూపొందించారు. 
 
దీనిని సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. అలాగే, అక్కడ ఓ మొక్కను నాటారు. డీజీపీ కార్యాలయంలో పోలీసుల అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప సీఎం పన్నీరుసెల్వం, మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్, డీజీపీ త్రిపాఠి, చెన్నై పోలీసుకమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments