దీపావళి పండుగ రోజున చెన్నైకు వాయు'గండం'

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (11:46 IST)
దీపావళి పండుగ రోజున చెన్నై మహానగరానికి వాయుగుండం ముప్పు పొంచివుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడం, మరోవైపు బంగాళా ఖాతంలో రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారనుండటంతో దీపావళి రోజున కుండపోతకు అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. 
 
ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చెన్నై నగరంలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా ఏర్పడిన అల్పవాయు పీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 
 
ఈ అల్పవాయు పీడనం వాయుగుండంగామారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో గత 6వ తేదీన మరో కొత్త అల్పవాయుపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలా రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారే అవకాశం ఉండటంతో దీపావళి నాడు రాష్ట్రమంతటా ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments