Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి పండుగ రోజున చెన్నైకు వాయు'గండం'

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (11:46 IST)
దీపావళి పండుగ రోజున చెన్నై మహానగరానికి వాయుగుండం ముప్పు పొంచివుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడం, మరోవైపు బంగాళా ఖాతంలో రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారనుండటంతో దీపావళి రోజున కుండపోతకు అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. 
 
ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చెన్నై నగరంలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా ఏర్పడిన అల్పవాయు పీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 
 
ఈ అల్పవాయు పీడనం వాయుగుండంగామారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో గత 6వ తేదీన మరో కొత్త అల్పవాయుపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలా రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారే అవకాశం ఉండటంతో దీపావళి నాడు రాష్ట్రమంతటా ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments