Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (21:16 IST)
విద్యార్థినిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కంప్యూటర్ ల్యాబ్‌కు తీసుకెళ్లిమరీ పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తన  తల్లిదండ్రులకు చెప్పడంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్యూటర్ ఉపాధ్యాయుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాడు. 
 
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన ముడిచ్చూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తాంబరం సమీపంలోని సోమంగళం ప్రాంతానికి చెందిన ఓ బాలిక ముడిచ్చూర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
 
అయితే, ఈ విద్యార్థినికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత శనివారం నుంచి సోమవారం వరకు పాఠశాలకు వెళ్లలేదు. పైగా, ఆమె తీవ్ర అనారోగ్యంగా ఉండటాన్ని తల్లి గమనించి, ఏం జరిగిందంటూ నిలదీసింది. దీంతో పాఠశాలలో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని తల్లి తాంబరం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ (30) విద్యార్థినిని కంప్యూటర్‌ ల్యాబ్‌కు తీసుకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments