Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీని నిరూపించుకున్న ఆటో డ్రైవర్.. 50 సవర్ల బంగారాన్ని ఏం చేశాడంటే?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (21:46 IST)
ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. అతని పేరు శరవణకుమార్. తన ఆటో ఎక్కి బంగారు సంచిని మర్చిపోయి వెళ్లిపోయిన ప్యాసింజర్‌కు తిరిగి ఆ బంగారం బ్యాగును తిరిగి అప్పగించేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై క్రోంపేట సమీపంలో ఆటో నడిపే శరవణకుమార్ ఆటోను గురువారం (జనవరి 28)న క్రోంపేటకు చెందిన ఆల్‌బ్రైట్‌ వ్యాపారుల సంఘం నేత ఎక్కాడు. అతనితో పాటు ఓ బ్యాగు కూడా ఉంది. గురువారం ఉదయం క్రోంపేటలోని ఓ చర్చిలో అతని కూతురు వివాహం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
 
ఈ క్రమంలో బంగారం నగలు ఉన్న బ్యాగుతో ఆటోలో బయలుదేరిన సదరు వ్యాపారి శరవరణకుమార్ ఆటో ఎక్కాడు. కొద్ది సేపటికి తన ఇల్లు రాగానే మిగతా లగేజ్ అంతా తీసుకున్నాడు గానీ నగల బ్యాగ్ ఆటో మర్చిపోయి దిగి వెళ్లిపోయాడు. శరవణకుమార్ కూడా ఆటో చార్జీలు తీసుకుని వెళ్లిపోయాడు.
 
ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్‌బ్రైట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆటో బ్యాక్ సీట్లో నగల సంచి ఉండడం గమనించిన 30 ఏళ్ల ఆటో డ్రైవర్‌ శరవణకుమార్‌ ఆ నగల బ్యాగు తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.
 
నగలను పోలీసులు సరి చూసి ఆల్‌బ్రైట్‌ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. ఆ బ్యాగులో 50 సవర్ల నగలు సురక్షితంగా ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు. ఆ నగల విలువ రూ.20లక్షలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగును ఓ వ్యక్తి తన ఆటోలో మరచిపోయాడని ఫలానా ప్రాంతంలో దిగాడని చెప్పాడు. అతని ఫోన్ నంబర్ నాదగ్గర లేకపోవటంతో పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments