Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిన చంద్రయాన్-3 : ఇస్రో ట్వీట్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (16:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ ద్వారా మద్దాడేలా చేసింది. దీనిపై ఇస్రో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిందని తెలిపింది. సాఫ్ట్ ల్యాండింగ్, జాబిల్లిపై రోవర్ సంచారం విజయవంతంగా ముగిసిననట్టు తెలిపింది. ప్రస్తుతం జాబిల్లిపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రోవర్‌లో ఉన్న అని వ్యవస్థలు సాఫీగా పని చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. 
 
"చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయింద"ని తెలిపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా, జాబిల్లి ఉపరితలంపై ప్రస్తుతం పలు ప్రయోగాలు జరుగుతున్నాయని, అన్ని వ్యవస్థలూ ఆశించిన స్థాయిలో పనితీరును కనబరుస్తున్నాయని ప్రకటించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ జాబిల్లి దక్షిణ ధృవంపై వ్యోమనౌక నిలిపిన తొలి దేశంగా బుధవారం ఓ అరుదైన రికార్డున సృష్టించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments