Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని నిమిషాల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్ ల్యాండర్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (15:19 IST)
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది. సుధీర్ఘంగా ప్రయాణం చేసిన విక్రమ్ ల్యాండర్ మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా, ఆటోమేటిక్‌ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత ప్రాంతానికి 5.44 గంటలకు చేరుకుంటుందని ఇస్రో ట్వీట్  చేసింది. 
 
అదేసమయానికి ఆటోమేటిక్‌ ల్యాండిగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం 5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని వెల్లడించింది. అంతా అనుకున్నట్టుగా సాఫీగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపుతుందని వెల్లడించింది. కాగా, ఈ ప్రయోగ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు చాలా కీలకమని పేర్కొంది. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే, ఇస్రో యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజీలలో కూడా చూడొచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments