Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన చంద్రయాన్-2 - లక్ష్యం దిశగా...

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:20 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసింది. ఈ స్పేస్ మిషన్ క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ క్రమంలో భూకక్ష్యను అధిగమించే క్రమంలో ఐదో దశను విజయవంతంగా పూర్తిచేసింది. తద్వారా చంద్రుడి సమీపానికి చేరుకుంది. 
 
ఈ ప్రక్రియ కోసం స్పేస్ క్రాఫ్టులోని ప్రొపల్షన్ వ్యవస్థను 1041 సెకన్ల పాటు మండించారు. దాంతో, స్పేస్ క్రాఫ్టు నిర్దేశిత 276×142975 కి.మీ కక్ష్యలో అడుగుపెట్టింది. తదుపరి ప్రక్రియలో భాగంగా చంద్రయాన్-2 ఈ నెల 14వ తేదీన భూకక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. 
 
మరోవైపు, ఇటీవల చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈ నెల 3వ తేదీన ఇస్రో విడుదల చేసిన విషయం తెల్సిందే. జాబిల్లిపై నుంచి భూమిని పరిశీలిస్తే, నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఇస్రో షేర్ చేయగా, ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం నాలుగు ఫోటోలను చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీయగా, వాటిని శాస్త్రవేత్తలు షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments