Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన చంద్రయాన్-2 - లక్ష్యం దిశగా...

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:20 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసింది. ఈ స్పేస్ మిషన్ క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ క్రమంలో భూకక్ష్యను అధిగమించే క్రమంలో ఐదో దశను విజయవంతంగా పూర్తిచేసింది. తద్వారా చంద్రుడి సమీపానికి చేరుకుంది. 
 
ఈ ప్రక్రియ కోసం స్పేస్ క్రాఫ్టులోని ప్రొపల్షన్ వ్యవస్థను 1041 సెకన్ల పాటు మండించారు. దాంతో, స్పేస్ క్రాఫ్టు నిర్దేశిత 276×142975 కి.మీ కక్ష్యలో అడుగుపెట్టింది. తదుపరి ప్రక్రియలో భాగంగా చంద్రయాన్-2 ఈ నెల 14వ తేదీన భూకక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. 
 
మరోవైపు, ఇటీవల చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈ నెల 3వ తేదీన ఇస్రో విడుదల చేసిన విషయం తెల్సిందే. జాబిల్లిపై నుంచి భూమిని పరిశీలిస్తే, నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఇస్రో షేర్ చేయగా, ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం నాలుగు ఫోటోలను చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీయగా, వాటిని శాస్త్రవేత్తలు షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments