Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమిని ఫోటో తీసిన చంద్రయాన్-2... షేర్ చేసిన ఇస్రో

భూమిని ఫోటో తీసిన చంద్రయాన్-2... షేర్ చేసిన ఇస్రో
, ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:24 IST)
ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జాబిల్లిపైకి చంద్రయాన్-2 పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. చంద్రయాన్-2 మిషన్ పేరుతో ఈ శాటిలైట్‌ను గత నెల 22వ తేదీన చంద్రమండలంపైకి పంపించారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట‌ర్‌లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. ప్రస్తుతం చంద్రయాన్‌-2 మిషన్‌ ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
webdunia
 
ఇదిలావుంటే, శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు.
webdunia
 
తర్వాత ఈ నెల 14వ తేదీన చివరిగా చంద్రయాన్-2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చంద్రయాన్-2 మిషన్‌ గమనాన్ని నిశితంగా పరీక్షిస్తున్నారు.
webdunia
 
ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఆదివారం (ఆగస్టు మూడో తేదీ) విడుదల చేసింది. నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఇస్రో షేర్ చేయగా, ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం నాలుగు ఫోటోలను చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీయగా, వాటిని శాస్త్రవేత్తలు షేర్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓడిపోయిన చోట నుంచే పవన్ పర్యటనకు శ్రీకారం... తొలిసారి భీమవరంకు...