Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడిపంతులు బదిలీపై వెళుతుంటే కన్నీరుమున్నీరైన విద్యార్థులు

Webdunia
శనివారం, 16 జులై 2022 (17:42 IST)
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. అలాంటి గురువులు తమ పాఠశాలను వీడి మరో స్కూలుకు వెళుతుంటే విద్యార్థులు బోరున విలపిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఓ బడిపంతులు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెళ్లొద్దు సార్ అంటూ బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని చందౌలి జిల్లా రాయ్‌ఘడ్ అనే మారుమాల కొండ ప్రాంతంలో ఉన్న పాఠశాలకు నాలుగేళ్ల క్రితం శివేంద్ర సింగ్ అనే ఉపాధ్యాయుడు విధుల్లో చేరాడు. చిన్నారులకు మంచి చెడులు చెపుతూ వారి మనస్సులను గెలుచుకున్నాడు. విద్యా బోధన కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించేవాడు. దీంతో శివేంద్రను చిన్నారులు అమితంగా ప్రేమిస్తూ వచ్చారు. పైగా, గత నాలుగేళ్లలో చిన్నారుల హాజరుశాతం కూడా గణనీయంగా పెరిగింది. 
 
ఈ క్రమంలో శివేంద్ర సింగ్‌ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థులు బోరున విలపించారు. సరిగ్గా గురు పౌర్ణమి రోజున ఆయనకు వీడ్కోలు పలికారు. ఆ పార్టీలో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ విద్యార్థులను సముదాయించి, వారి నుంచి సెలవు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments