Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై కారులో ఆరు ఎయిర్ బ్యాగులు.. అక్టోబరు ఒకటి నుంచి కొత్త నిబంధన

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:24 IST)
కేంద్ర రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ప్రయాణించే వారి భద్రతపై దృష్టిసారించింది. దీంతో కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్ బ్యాగులు అమర్చాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఇటీవల టాటా అండ్ సన్స్ మాజీ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ కారు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈయన కారు వెనుక సీట్లో కూర్చొని ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంపై కేంద్ర రవాణా శాఖ సమగ్ర అధ్యయనం చేసింది.

ఇకపై జరిగే ప్రమాదాల్లో ముందు సీట్లో కూర్చున్న వారేకాకుండా వెనుకసీట్లో కూర్చున్న వారు కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ కొత్త నిబంధన అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఇకపై ప్రతి కారులో కనీసం ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కార్లు వేరియంట్లు, ధరతో సంబంధం లేకుండా ప్రతి కారులో ముందు, వెనుక సీట్లలో కూర్చొన్న ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆరు ఎయిర్ బ్యాగులు అమర్చాల్సిందేనంటూ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments