Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒకే దేశం - ఒకే ఎన్నికలు" : రాంనాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలో నిపుణుల కమిటీని శుక్రవారం ఏర్పాటుచేసింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుందని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌‍లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకేరోజున ఎన్నుకోవచ్చు. తద్వారా సమయంతో పాటు ఎన్నికల ఖర్చును కూడా గణనీయంగా తగ్గించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments