Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒకే దేశం - ఒకే ఎన్నికలు" : రాంనాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలో నిపుణుల కమిటీని శుక్రవారం ఏర్పాటుచేసింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుందని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌‍లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకేరోజున ఎన్నుకోవచ్చు. తద్వారా సమయంతో పాటు ఎన్నికల ఖర్చును కూడా గణనీయంగా తగ్గించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments