Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా: ఇక మిగిలింది ఒక్కరే

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (22:30 IST)
పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో హఠాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన ఎందుకు రాజీనామా చేసారన్నది తెలియాల్సి వుంది. కాగా ఈయన పదవీకాలం 2027 వరకూ వున్నది. ఐతే మూడేళ్లు ముందుగానే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
 
అరుణ్ గోయల్ 1985 పంజాబ్ కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2022లో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులయ్యారు. ఇదిలావుండగా ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని అనుప్ పాండే గత ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసారు. తాజాగా అరుణ్ రాజీనామా చేసారు. ఇక మిగిలింది సీఈసిగా వున్న రాజీవ్ కుమార్ ఒక్కరే. ఈ నేపధ్యంలో ఖాళీగా వున్న రెండు పోస్టులను ఎపుడు భర్తీ చేస్తారన్నది చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

తర్వాతి కథనం
Show comments