Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా: ఇక మిగిలింది ఒక్కరే

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (22:30 IST)
పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో హఠాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన ఎందుకు రాజీనామా చేసారన్నది తెలియాల్సి వుంది. కాగా ఈయన పదవీకాలం 2027 వరకూ వున్నది. ఐతే మూడేళ్లు ముందుగానే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
 
అరుణ్ గోయల్ 1985 పంజాబ్ కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2022లో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులయ్యారు. ఇదిలావుండగా ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని అనుప్ పాండే గత ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసారు. తాజాగా అరుణ్ రాజీనామా చేసారు. ఇక మిగిలింది సీఈసిగా వున్న రాజీవ్ కుమార్ ఒక్కరే. ఈ నేపధ్యంలో ఖాళీగా వున్న రెండు పోస్టులను ఎపుడు భర్తీ చేస్తారన్నది చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments