Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా గాంధీ రోడ్ షో... సెల్ ఫోన్ దొంగలు వీరవిహారం...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:12 IST)
ప్రియాంక గాంధీ రాకతో నూతన సమరోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రియాంకగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. నిన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో పాల్గొంది. లక్నో విమానాశ్రయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించగా అందులో పాల్గొన్న అనేక మంది ఫోన్‌లు దొంగిలించబడ్డాయి. దాదాపు 50 మందికి పైగా ఫోన్‌లు తస్కరించబడ్డాయి. 
 
రోడ్‌షోకి ఎక్కువ మంది గుమిగూడటం వల్ల దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకుల ఫోన్‌లు సైతం చోరీకి గురైయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్‌ ఫోన్ కూడా దొంగిలించబడడం కొసమెరుపు. దాదాపుగా యాభై మంది నుండి ఫోన్‌లు చోరీకి గురైయ్యాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు దొంగలను పట్టుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన ఫోన్‌లను రికవర్ చేసుకోవడానికి సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం