Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా గాంధీ రోడ్ షో... సెల్ ఫోన్ దొంగలు వీరవిహారం...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:12 IST)
ప్రియాంక గాంధీ రాకతో నూతన సమరోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రియాంకగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. నిన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో పాల్గొంది. లక్నో విమానాశ్రయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించగా అందులో పాల్గొన్న అనేక మంది ఫోన్‌లు దొంగిలించబడ్డాయి. దాదాపు 50 మందికి పైగా ఫోన్‌లు తస్కరించబడ్డాయి. 
 
రోడ్‌షోకి ఎక్కువ మంది గుమిగూడటం వల్ల దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకుల ఫోన్‌లు సైతం చోరీకి గురైయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్‌ ఫోన్ కూడా దొంగిలించబడడం కొసమెరుపు. దాదాపుగా యాభై మంది నుండి ఫోన్‌లు చోరీకి గురైయ్యాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు దొంగలను పట్టుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన ఫోన్‌లను రికవర్ చేసుకోవడానికి సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం