Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ కున్నూరుకు ఎందుకు వెళ్లారు?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:13 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అనే కొండ అటవీ ప్రాంతంలో భారత రక్షణ రంగానికి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వివరాలు తెలియాల్సివుంది. ఈ హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. అయితే, ఈ ఇద్దరిలో మధులిక రావత్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు.
 
ఇదిలావుంటే అస్సలు బిపిన్ రావత్ కన్నూరుకు ఎందుకు వెళ్లారో పరిశీలిస్తే, కన్నూరుకు సమీపంలో ఉన్న వెల్లింగ్టన్ ఆర్మీ ట్రైనింగ్ కేంద్రంలో జరిగే ఓ కార్యక్రమానికి ఆయన హాజరై కీలక ప్రసంగం చేయాల్సివుంది. ఈ కేంద్రంలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన ఈ హెలికాఫ్టర్ కాట్టేరి వద్ద కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదానికి కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? లేక విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments