Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ కున్నూరుకు ఎందుకు వెళ్లారు?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:13 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అనే కొండ అటవీ ప్రాంతంలో భారత రక్షణ రంగానికి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వివరాలు తెలియాల్సివుంది. ఈ హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. అయితే, ఈ ఇద్దరిలో మధులిక రావత్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు.
 
ఇదిలావుంటే అస్సలు బిపిన్ రావత్ కన్నూరుకు ఎందుకు వెళ్లారో పరిశీలిస్తే, కన్నూరుకు సమీపంలో ఉన్న వెల్లింగ్టన్ ఆర్మీ ట్రైనింగ్ కేంద్రంలో జరిగే ఓ కార్యక్రమానికి ఆయన హాజరై కీలక ప్రసంగం చేయాల్సివుంది. ఈ కేంద్రంలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన ఈ హెలికాఫ్టర్ కాట్టేరి వద్ద కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదానికి కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? లేక విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments