Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యోగి'తో రహస్య సమాచారం షేర్ చేసిన చిత్రా రామకృష్ణన్.. అరెస్టు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (09:17 IST)
హిమాలయాల్లో ఉన్న ఒక యోగితో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ యోగితో షేర్ చేసుకున్నందుకుగాను ఆమెను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. 59 యేళ్ల చిత్ర రామకృష్ణన్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఈమె 2013-16 మధ్యకాలంలో ఎన్.ఎస్.ఈకి సీఈవోగా పని చేశారు ఆ సమయంలో ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో నివసించే ఒక యోగితో షేర్ చేసుకున్నారు. అదీ కూడా ఈమెయిల్ ద్వారా షేర్ చేశారు. 
 
అయితే, ఆ యోగి ఎవరో కాదు... ఎన్.ఎస్.ఈ మాజీ ఉద్యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యమేనని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఈ నెల ఆరంభంలోనే అరెస్టు అయిన విషయం తెల్సిందే. 
 
2010-15 మధ్య కాలంలో ఎన్ఎస్ఈలో అవకతవకలు జరిగినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించి బయటపెట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ఎస్ఈ సమాచారాన్ని 2014-16 మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తితో చిత్రా రామకృష్ణన్ ఈమెయిల్ ద్వారా షేర్ చేసినట్టు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించింది. దీంతో ఆమెను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments