Webdunia - Bharat's app for daily news and videos

Install App

'క్యాబ్‌'కు రాజ్యసభ ఆమోదం ... అనుకూలం 125 - వ్యతిరేకం 105

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (10:37 IST)
పౌరసత్వ సవరణ బిల్లు 2019కు రాజ్యసభ ఆమోదముద్రవేసింది. ఈ బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు మద్దతు తెలుపగా, వ్యతిరేకంగా 105 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో గురువారం ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
 
ఈ బిల్లును బుధవారం హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆరున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా, బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మతం ప్రాతిపదికన ప్రజలమధ్య విభజన రేఖ గీస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. శరణార్థుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని ప్రశ్నించాయి. 
 
ఆ తర్వాత విపక్ష సభ్యుల ప్రశ్నలకు హోం మంత్రి అమిత్‌ షా సమాధానమిచ్చారు. దేశంలోని ముస్లింలకు ఈ బిల్లుతో ఎలాంటి నష్టం కలుగదని స్పష్టంచేశారు. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 మంది ఎంపీలు ఓటేశారు. ఈ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో ఓటింగ్‌ను బహిష్కరించింది. 
 
కాగా, ఈ బిల్లుకు జేడీయూ, అకాలీదళ్‌, ఏఐఏడీఎంకే, వైసీపీ, టీడీపీ, బీపీఎఫ్‌ తదితర పార్టీలు మద్దతు తెలుపగా, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్‌ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందిస్తూ ‘ప్రజాస్వా మ్య చరిత్రలో ఇదో చీకటి రోజని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments