Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాలను మింగేసిన ఎద్దు... పేడలోనైనా వస్తాయనీ...

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:51 IST)
హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఎద్దు బంగారు ఆభరణాలను మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న గృహిణి ఆ ఎద్దు వేసే పేడలోనైనా బంగారు ఆభరణాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిర్సాలోని కలనవాలి ఏరియాలో ఓ మహిళ తన వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ గిన్నెలో వేసింది. అయితే కూరగాయలు కత్తిరించగా వచ్చిన చెత్తను బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో పొరపాటున వేసింది. 
 
ఆ గిన్నెలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయన్న విషయం మరిచిన మహిళ... తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండీ వద్ద పడేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయల చెత్తతో పాటు బంగారు ఆభరణాలను కూడా మింగేసింది. 
 
ఆ తర్వాత ఇంట్లో పెట్టిన బంగారం కనిపించకపోవడంతో ఇంటి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించింది. ఆమె పడేసిన చెత్తను ఎద్దు తిన్నట్లు సీసీ కెమెరాల్లో తేలింది. దీంతో బాధితురాలు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించి.. ఆ ఎద్దును పట్టుకున్నారు. 
 
ఇప్పుడు తన ఇంటి వద్దే ఎద్దును కట్టేసి దాన పెడుతున్నారు. మింగేసిన బంగారం.. పేడలోనైనా వస్తుందేమోనని ఆమె ఆశలు పెట్టుకుంది. ఒక వేళ పేడలో కూడా బంగారం రాకపోతే.. ఈ ఎద్దును గోశాలకు తరలిస్తామని బాధితురాలు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments