Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. కాశ్మీరేతరులే టార్గెట్‌.. 15 రోజుల్లో 11 మంది మృతి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:41 IST)
కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. కాశ్మీరేతరులే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతున్నాయి. మంగళవారం పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అగస్టు ఐదో తేదీ నుంచి కాశ్మీరేతలరుపై దాడులు చేయడం ఇది ఏడోసారి. గత 15 రోజుల్లో 11 మంది కాశ్మీరేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపారు.
 
మంగళవారం కాశ్మీరేతరులైన ఐదుగురు కూలీలను కుల్గామ్‌ జిల్లాలోని కాట్రాసులో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రంగా గాయాలైనాయి. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముర్షిదాబాద్‌ ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 
 
మొత్తం తొమ్మిది మంది కూలీలు వారి షెడ్‌లో ఉండగా ఉగ్రవాదులు వాళ్లని బయటకు లాగి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. వీరంతా భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. సోమవారం నాడు అనంతనాగ్‌ జిల్లాలో కాశ్మీరేతరుడైన ఒక ట్రక్‌ డ్రైవర్‌ను కాల్చి చంపారు. అంతకు ముందు వేర్వేరుచోట్ల మరో ముగ్గురు ట్రక్‌ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments