Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవధ వ్యతిరేక రాలీని అడ్డుకున్న ఖాకీ... రాళ్ళతో కొట్టిచంపిన నిరసనకారులు

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:59 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గోవధ వ్యతిరేక ర్యాలీని ఓ పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ఆ కానిస్టేబుల్‌ను కొట్టిచంపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీ రాష్ట్రంలోని బులంద్ షెహర్‌లో గోవధ జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కొందరు స్థానికులు కలిసి గోవధ వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
దీనిపై బులంద్‌ షెహ‌ర్ జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్ స్పందిస్తూ, డిసెంబరు 3వ తేదీ సోమవారం ఉదయం ఆందోళ‌న‌కారులు ఆందోళ‌న‌కు దిగారు. వాళ్లంతా రోడ్డుపై నిర‌స‌న వ్య‌క్తంచేశారు. పలు వాహనాలకు నిప్పు అంటించారు. విధ్వంసకాండ సృష్టించారు. అయితే వాళ్ల‌ను అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులుపై రాళ్లు రువ్వార‌ు. ఈ క్రమంలో ఎస్హెచ్ఓ సుబోధ్ కుమార్ గాయపడి ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేపనిలో ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments