Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం - వేర్వేరు సమయాల్లో...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:03 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ సమావేశం కావాల్సివుంది. ఇందుకోసం పార్లమెంట్ సమావేశంకానుంది. అయితే, ఈ సమావేశాల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయంతో మార్పు కూడా చేసింది. 
 
పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. అంటే ఉదయం వేళ రాజ్యసభ, సాయంత్రం వేళ లోక్‌సభను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభను, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వార్తా ప్రకటనను విడుదల చేసింది. 
 
కాగా, ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సివుంది. ఇందుకోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుందని, 2వ తేదీ నుంచి మాత్రం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తెలిపింది. అయితే, రాజ్యసభ మార్పు సమయాలపై రాజ్యసభ సచివాలయం అధికారిక ప్రకటన చేయాల్సివుంది. ఎందుకంటే.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్ సోకడంతో ఆయన హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయారు. దీంతో రాజ్యసభ సమయంపై అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments