Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం - వేర్వేరు సమయాల్లో...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:03 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ సమావేశం కావాల్సివుంది. ఇందుకోసం పార్లమెంట్ సమావేశంకానుంది. అయితే, ఈ సమావేశాల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయంతో మార్పు కూడా చేసింది. 
 
పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. అంటే ఉదయం వేళ రాజ్యసభ, సాయంత్రం వేళ లోక్‌సభను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభను, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వార్తా ప్రకటనను విడుదల చేసింది. 
 
కాగా, ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సివుంది. ఇందుకోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుందని, 2వ తేదీ నుంచి మాత్రం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తెలిపింది. అయితే, రాజ్యసభ మార్పు సమయాలపై రాజ్యసభ సచివాలయం అధికారిక ప్రకటన చేయాల్సివుంది. ఎందుకంటే.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్ సోకడంతో ఆయన హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయారు. దీంతో రాజ్యసభ సమయంపై అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments