పార్లమెంట్ సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం - వేర్వేరు సమయాల్లో...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:03 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ సమావేశం కావాల్సివుంది. ఇందుకోసం పార్లమెంట్ సమావేశంకానుంది. అయితే, ఈ సమావేశాల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయంతో మార్పు కూడా చేసింది. 
 
పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. అంటే ఉదయం వేళ రాజ్యసభ, సాయంత్రం వేళ లోక్‌సభను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభను, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వార్తా ప్రకటనను విడుదల చేసింది. 
 
కాగా, ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సివుంది. ఇందుకోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుందని, 2వ తేదీ నుంచి మాత్రం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తెలిపింది. అయితే, రాజ్యసభ మార్పు సమయాలపై రాజ్యసభ సచివాలయం అధికారిక ప్రకటన చేయాల్సివుంది. ఎందుకంటే.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్ సోకడంతో ఆయన హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయారు. దీంతో రాజ్యసభ సమయంపై అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments