Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళపై బదిలీవేటు..

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (09:27 IST)
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై బదిలీ వేటుపడింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలిఫోన్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రెహానాను ప్రస్తుతమున్న కేరళలోని బోట్‌ జెట్టీ బ్రాంచ్‌ నుంచి పలరివట్టం టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ శాఖకు బదిలీ చేస్తూ ఆ సంస్థ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆలయ ప్రవేశం వివాదం కారణంగానే కస్టమర్‌ రిలేషన్‌ సెక్షన్‌లో టెక్నిషియన్‌ అయిన రెహానాను, ప్రజలతో పెద్దగా సంబంధం ఉండని పలరివట్టంలోని వేరే శాఖకు బదిలీ చేసినట్టు సమాచారం. కాగా రెహానా ఇక్కడ కూడా పనిచేయకుండా బహిష్కరించాలని కోరుతూ శబరిమల కర్మ సమితి మంగళవారం పలరివట్టంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. 
 
అయితే రెహానా ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఉద్యోగాన్ని వదులుకోబోదని ఆమె సన్నిహితుల చెబుతున్నారు. దీనిపై రెహానా నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు హింసను ప్రేరేపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నలుగురు మహిళలు మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం