Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ... మహిళా అధికారిణికి మంత్రి సందేశాలు

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (09:09 IST)
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. దీంతో సినీ ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రివరకు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు పంపించారు. చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ అంటూ పేర్కొన్నారు. 
 
ఈ సందేశాన్ని చూసిన ఆ మహిళా అధికారికి ఖిన్నురాలైంది. అసభ్య సందేశం పంపించింది ఓ మంత్రి అనికూడా చూడకుండా ఏకంగా ముఖ్యమంత్రి అమరీదర్ సింగ్ దృష్టికి తీసుకెళ్ళింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి అమరీందర్ సింగ్... మంత్రిని పిలిచి మందలించారు. అంతేకాకుండా, మహిళా అధికారిణికి క్షమాపణలు చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. 
 
దీంతో మంత్రి మహిళా అధికారిణికి క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అయితే, ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. మహిళా అధికారిణిని అభ్యంతరకరమైన సందేశాలతో వేధించిన పంజాబ్ రాష్ట్ర మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం