Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య అత్యాచారం చేశాడా? గమ్మునుండు... పరువుపోద్ది...

అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంల

Webdunia
బుధవారం, 25 జులై 2018 (16:30 IST)
అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా చండీఘర్‌లో చోటుచేసుకున్న దారుణం ఇలా వుంది. 
 
11 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల సోదరుడు గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పింది. ఐతే విషయాన్ని విన్న తల్లి కుమారుడిపై చర్య తీసుకోవాల్సింది పోయి... గమ్మునుండు... పరువు పోతుంది. చేస్తే చేశాడులే అంటూ ఆమెకు సర్దిచెప్పింది. అంతటితో ఊరుకోకుండా ఆమె మతిభ్రమించి మాట్లాడుతుందంటూ తాంత్రికవేత్తల వద్దకు తీసుకెళ్లింది. 
 
కానీ ఆ బాలికపైన సోదరుడు మాత్రం ప్రతిరోజూ అత్యాచారానికి పాల్పడుతూనే వున్నాడు. చివరికి బాధిత బాలిక విషయాన్ని తను చదువుకుంటున్న పాఠశాలలో చెప్పేసరికి వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments