Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడి మర్మాంగం కోసి దారుణ హత్య

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (10:17 IST)
వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు, మతాలు వేరు.. అయినా ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దలను ఒప్పిద్దామనుకున్నారు. ప్రేమించినవాడితో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతి  కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. తన కుటుంబ సభ్యులే తన ప్రియుడిని అతి కిరాతకంగా చంపుతుంటే చూస్తూ ఉండిపోయింది. 

తమ కుమార్తెను  వేరే కులం వాడు ప్రేమించాడని, ఆమె ప్రేమించిన వ్యక్తి మర్మాంగాన్ని కోసి అతి కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు. బీహార్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో పోలీసులు త్వరగానే పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాలలోకి వెళితే.. ముజఫర్‌పూర్ జిల్లా రేపురా రామ్‌పుర్షా గ్రామానికి చెందిన  సౌరభ్‌రాజ్(19).. సోర్బారా గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.

సౌరభ్ వేరే కులానికి చెందినవాడు కావడంతో వారి ప్రేమను యువతి  తల్లిదండ్రులు నిరాకరించారు. శుక్రవారం రాత్రి సౌరభ్‌ను పెళ్లి విషయం మాట్లాడమని ఇంటికి పిలిచి.. అతడిపై దాడికి తెగబడ్డారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలకు గురి చేశారు.
 
అనంతరం అతడిని ఒక హాస్పిటల్‌లో చేర్చి పరారయ్యారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. యువతి ఇంటిపై దాడికి దిగారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి నిందితుల ఇంటి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, కీలక నిందితుడిగా భావిస్తున్న సుశాంత్‌ పాండే అనే యువకుడిని అరెస్టుచేశారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments