Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం - కవితకు ఈడీ నోటీసులు

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (19:45 IST)
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం హాజరుకావలంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఈ కేసులో గత యేడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు వించారించారు. తాజాగా మరోమారు నోటీసులు పంపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‍కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు జారీచేసింది. 
 
కానీ, ఆయన మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలంటూ మరోమారు అంటే నాలుగోసారి నోటీసులు జారీచేసింది. అయితే, తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోమారు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇదిలావుంటే ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments