Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత

kavitha
, సోమవారం, 20 మార్చి 2023 (12:41 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కె.కవిత హాజరయ్యారు. ఇందుకోసం ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న కవిత.. సోమవారం ఉదయం 11 గంటలకు ముందే ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను కన్ ఫ్రంటేషన్ పద్ధతలితో విచారిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్‌లో ముఖ్యంగా సౌత్ గ్రూప్ వ్యవహారాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఆందించినట్టు ఆరోపిస్తున్న వంద కోట్ల రూపాయల వ్యవహారంపై విచారిస్తున్నారు. 
 
అరుణ్ రామచంద్ర పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ అన్న ఆరోపణల నేపథ్యంలో వివిధ ఆర్థిక లావాదేవీలపై ఇద్దరినీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ కేసులో పిళ్లై కస్టడీ సోమవారం మధ్యాహ్నానికి ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పిళ్లైని తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి కవితను కన్ ఫ్రంటేషన్‌ పద్దతిలో విచారించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిళ్లై కస్టడీ ముగిసేలోపు కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!