Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!
, సోమవారం, 20 మార్చి 2023 (12:06 IST)
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‍లో మరో విషాదకర ఘటన జరిగింది. స్థానిక శాస్త్రి మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడిని మయూర్‌గా గుర్తించారు. గత 45 రోజుల్లో ఈ తరహా ఘటనలు జరగడం ఇది ఎనిమిదోది. 
 
ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ బౌలింగ్ చేస్తుండగా, అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన మైదానంలో కొంది సేపు కూర్చొని కిందపడిపోయాడు. అతని స్నేహితులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మయూర్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, స్వర్ణకారుడైన మయూర్.. కుటుంబానికి ఏకైక ఆధారం. పైగా, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంట పొలంలో భారీ మొసలి .. జడుసుకున్న రైతు