Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపుల్లో చూసిన వ్యక్తి ఇతను కాదు.. దండలు మార్చుకునే సమయంలో?

పెళ్లిచూపుల్లో చూసింది ఒకరిని... వివాహ మండపంలో వున్నది వేరొకడని.. ఓ వధువు హంగామా చేసింది. పెళ్లిచూపుల సమయంలో తనకు చూపించిన యువకుడు, కల్యాణ మండపంపైకి వచ్చిన యువకుడు వేర్వేరు వ్యక్తులని.. ఇద్దరూ ఒకరు కా

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (11:04 IST)
పెళ్లిచూపుల్లో చూసింది ఒకరిని... వివాహ మండపంలో వున్నది వేరొకడని.. ఓ వధువు హంగామా చేసింది. పెళ్లిచూపుల సమయంలో తనకు చూపించిన యువకుడు, కల్యాణ మండపంపైకి వచ్చిన యువకుడు వేర్వేరు వ్యక్తులని.. ఇద్దరూ ఒకరు కాదని షాకిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఔఛా ప్రాంతానికి చెందిన రాజేష్ గుప్తా కుమారుడు అభిషేక్ గుప్తాకు, ఫిరోజాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ గుప్తా కుమార్తె తృప్తీ గుప్తాకు వివాహం నిశ్చయమైంది. ఔఛాలో ఈ పెళ్లిని ఘనంగా చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ వధూవరులిద్దరినీ మండపంపైకి తీసుకువచ్చిన కాసేపట్లోనే.. దండలు మార్చుకునే సమయంలో పెళ్లి కుమార్తెకు అనుమానం వచ్చింది. తనకు ఈ పెళ్లి వద్దని, తనను మోసం చేస్తున్నారని ఆరోపించింది. 
 
చూపుల్లో చూసిన వరుడికి.. మండపంలో దండలు మార్చుకునే వ్యక్తికి తేడా వుందని వధువు తెలిపింది. బలవంతంగా పెళ్లి చేస్తే చనిపోతానే తప్ప, కాపురం మాత్రం చేయలేనని మొండికేసింది. పెళ్లి చూపుల్లో చూసిన యువకుడు ఇతను కాదని చెప్పింది. ఇక చేసేదేమీ లేక వివాహాన్ని రద్దు చేసుకుని, వరుడి తల్లిదండ్రులు మండపం నుంచి తీసుకెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments