Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్నం.. బైక్ వద్దన్నాడు.. బుల్లెట్ కావాలన్నాడు.. వరుడిని చితకబాదిన..?

Webdunia
శనివారం, 22 మే 2021 (14:28 IST)
వరకట్నం కింద బైక్ వద్దని బుల్లెట్ కావాలని ఓ పెళ్లి కొడుకు డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థాలు చితకబాదారు. చివరకు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అమేథీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అమేథీ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటోంది. మొహమ్మద్ అమీర్ కుమారుడు ఇమ్రాన్ సాజ్ తో నాసిమ్ కుమార్తెకు వివాహం నిశ్చయమైంది.
 
వివాహం జరిగిన అనంతరం విందులో వరుడు మనస్సులో ఉన్న కోరికను వెలిబుచ్చాడు. వరకట్నం కింద తనకు ఇచ్చిన బైక్ వద్దని, బుల్లెట్ వాహనం ఇవ్వాలని పట్టుబట్టాడు. అంత స్థోమత తనకు లేదని, త్వరలోనే బుల్లెట్, కారు ఇస్తానని వధువు తండ్రి చెప్పాడు.
 
ఎంత బతిమిలాడినా అతను వినిపించుకోలేదు. ఆగ్రహించిన గ్రామస్థులు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకుని తండ్రి, వరుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments