Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం: నలుగురు మృతి

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (15:51 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. సోపోర్‌లో సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు ప్రారంభించాయి.
 
కాగా గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్, కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మరోవైపు భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఐఈడీ బాంబులు పెడుతున్నారు. తాజాగా రెండు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. ఇక ఓ తోటలో ఉంచిన 5 కేజీల పేలుడు పదార్దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థం కేసుపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments