Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలుడిపై అత్యాచారయత్నం.. బండ రాయితో మోది..?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:24 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మధురవోయల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేండ్ల బాలుడిపై ఓ 17 ఏండ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. అయితే, అందుకు తొమ్మిదేండ్ల బాలుడు సహకరించపోవడంతో ఆగ్రహానికి లోనైన 17 ఏండ్ల బాలుడు తీవ్రంగా దాడిచేశాడు. పక్కనే ఉన్న బండ ముక్కతో విచక్షణారహితంగా కొట్టాడు. బాధిత బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు పారిపోయాడు.
 
ఇంతలో బాధిత బాలుడి జాడ కోసం వెతికిన అతని తల్లిదండ్రులు ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. దాంతో కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులకు మధురవోయల్ బైపాస్ సమీపంలో అపస్మారక స్థితిలో బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టిన పోలీసులు.. 17 బాలుడు నిందితుడిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు కేర్ హోమ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం