విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి దేశభక్తుడు కాలేడు.. చాణక్యుడు చెప్పారట..!

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (13:38 IST)
భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని ఉద్ఘాటించారు. రాహుల్‌ గాంధీ ఆయన తల్లి సోనియా గాంధీ దేశభక్తిని ప్రగ్యా ఠాకూర్‌ ప్రశ్నించారు. 
 
"ఈ గడ్డపై జన్మించినవాడే దేశాన్ని కాపాడతాడు. ఒక విదేశీ వనితకు పుట్టినవాడు దేశభక్తుడు కాలేడని చాణక్య చెప్పారు. ఒకవేళ మీకు రెండు దేశాల్లో పౌరసత్వం ఉంటే దేశభక్తి అనుభూతి ఎలా కలుగుతుంది" ప్రగ్యా విమర్శలు గుప్పించారు. 
 
ఆయుధాలు లేకుండా జవాన్లను పంపారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, చైనా మన ప్రాంతాన్ని ఆక్రమించిందా, దాచివుంచడం దౌత్యనీతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్‌, సోనియా, మన్మోహన్‌ సింగ్‌ ఫైర్ అయ్యారు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు కాంగ్రెస్‌పై ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ జాబితాలో ప్రగ్యా కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నీతి, నైతికత, దేశభక్తికి ఆ పార్టీ దూరమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments