Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు ఓ గుడ్ న్యూస్.. పంచామృతం ఇక ఇంటికే..!

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (11:32 IST)
అవును.. అయ్యప్ప ప్రసాదం ఇక ఇంటికే రానుంది. శబరిమల ఆలయానికి ఎంతో మంది అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు అందరూ స్వామివారిని దర్శించుకొని తమ దీక్షను విరమించడానికి వెళుతూ ఉంటారు. దీంతో శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి వారి ఆలయం కొన్ని రోజులే తెరుచుకుని వుంటుంది. 
 
అయినప్పటికీ అక్కడ భక్తులు మాత్రం కోట్లల్లో తరలివస్తుంటారు. అయితే శబరిమల ఆలయంలో ప్రసాదం ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రసాదం పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు భక్తుల్లో నెలకొన్నాయి.
 
దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న శబరిమల ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేవస్థానం అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది. పోస్టు ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందిస్తామంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుండగా.. అప్పటి నుంచే ప్రసాదాన్ని కూడా పోస్టు ద్వారా అందించేందుకు నిర్ణయించామంటూ చెప్పుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. అయితే కేరళ రాష్ట్ర వాసులకు అయితే రెండు రోజులు ఇతర రాష్ట్రాల వాసులకు అయితే వారం రోజుల సమయంలో ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments