Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు ఓ గుడ్ న్యూస్.. పంచామృతం ఇక ఇంటికే..!

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (11:32 IST)
అవును.. అయ్యప్ప ప్రసాదం ఇక ఇంటికే రానుంది. శబరిమల ఆలయానికి ఎంతో మంది అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు అందరూ స్వామివారిని దర్శించుకొని తమ దీక్షను విరమించడానికి వెళుతూ ఉంటారు. దీంతో శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి వారి ఆలయం కొన్ని రోజులే తెరుచుకుని వుంటుంది. 
 
అయినప్పటికీ అక్కడ భక్తులు మాత్రం కోట్లల్లో తరలివస్తుంటారు. అయితే శబరిమల ఆలయంలో ప్రసాదం ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రసాదం పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు భక్తుల్లో నెలకొన్నాయి.
 
దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న శబరిమల ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేవస్థానం అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది. పోస్టు ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందిస్తామంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుండగా.. అప్పటి నుంచే ప్రసాదాన్ని కూడా పోస్టు ద్వారా అందించేందుకు నిర్ణయించామంటూ చెప్పుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. అయితే కేరళ రాష్ట్ర వాసులకు అయితే రెండు రోజులు ఇతర రాష్ట్రాల వాసులకు అయితే వారం రోజుల సమయంలో ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments