Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబు దాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:11 IST)
బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబ్ దాడి జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో మాత్రం ఓ రౌడి అనుచరులు బిర్యానీ పెట్టలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబ్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్‌ పేరుతో హోటల్‌ నిర్వహిస్తున్నారు. 
 
వారి హోటల్‌కు ఎబిన్ అనే రౌడీషీటర్ అనుచరులు బిర్యానీ కోసం వచ్చారు. రౌడీషీటర్‌ ఎబిన్‌ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ పెట్టాలని బెదిరించగా.. వారు అందుకు నిరాకరించారు. దీంతో హోటల్ దగ్గరే ఆగ్రహం వ్యక్తం చేసి ఎబిన్‌ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు.
 
కొంచెం సేపటి తర్వాత నాలుగు బైక్‌లపై 8మంది వచ్చి హోటల్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. దీనిపై హోటల్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments