Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా నదిలో పదుల సంఖ్యలో శవాలు.. కోవిడ్ మృతులను..?

Webdunia
సోమవారం, 10 మే 2021 (15:49 IST)
కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్న వేళ.. యమునా నదిలో తేలుతున్న శవాలను చూసి యూపీలోని హమీర్‌పూర్‌లోని ప్రజలు వణుకుతున్నారు. వీళ్లంతా కరోనాతో చనిపోయిన వాళ్లేమో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
 
హమీర్‌పూర్‌లో ఎన్ని కరోనాతో చనిపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారంటే.. వాళ్లను దహనం చేయడానికి చోటు దొరక్క.. ఇలా నదిలో పడేశారేమోనని కొందరు చెబుతున్నారు. 
 
యూపీలోని ఈ ప్రాంతంలో కరోనాతో ఎంత మంది చనిపోయారన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంట సమాచారం లేకపోవడం గమనార్హం. ఇక్కడి ఓ గ్రామంలో చనిపోయిన వాళ్లకు యమునా నది తీరంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
 
హమీర్‌పూర్‌, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది కరోనాతో చనిపోయినట్లు ఇక్కడి గ్రామస్థులు చెప్పారు. అలా చనిపోయిన వాళ్లను యమునా నదిలోకి విసిరేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య యమునా నది ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడ చనిపోయిన వాళ్లను నదిలో విసిరేయడం ఆనవాయితీగా వస్తోందని హమీర్‌పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments