Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మరోషాక్ : మమత చెంతకు మరో నేత రాజీబ్ బెనర్జీ

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (09:33 IST)
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న, బెంగాల్‌లో కీలక నేతగా ఉన్న ముకుల్ రాయ్ అధికార టీఎంసీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఆ మరుసటి రోజే పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీబ్ బెనర్జీ కూడా టీఎంసీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజీబ్ బెనర్జీ తాజాగా టీఎంసీ నేత కునాల్ ఘోష్‌తో శనివారం భేటీ కావడం పార్టీ మారతారన్న ఊహాగానాలకు తావిచ్చింది.
 
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డోమ్జూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన రాజీబ్ బెనర్జీ ఓటమి పాలయ్యారు. టీఎంసీ అధికార ప్రతినిధి అయిన కునాల్ ఘోష్‌ను నిన్న కోల్‌కతాలో ఆయన నివాసంలోనే కలిశారు. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని ఇరువురు నేతలు చెబుతున్నప్పటికీ పార్టీ మార్పు తథ్యమని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్-మే నెలల్లో పార్టీ వీడిన నేతలు, కార్యకర్తలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పడం గమనార్హం. అయితే, ఇపుడు పార్టీ నేతలను తిరిగి చేర్చుకునే విషయంలో రెండు కేటగిరీలుగా కేటాయించి, తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments